ఇదే నిజం , సిద్ధిపేట: సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేట మండలంలోని 300 మంది మహిళలకు కుట్టు మిషన్లను మాజీ మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు శుభదినం, మూడు పండుగలు ఒకేసారి జరుపుకుంటున్నామని అన్నారు. ఒకటి మన గొప్ప పండుగ మహా శివరాత్రి అయితే.. రెండోది మహిళల పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మూడోది మీ మహిళందరికీ కుట్టు మిషన్లు ఇచ్చే పండుగ అని అన్నారు, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు.