మర్డర్ మిస్టరీ సబ్జెక్ట్తో 2021లో వచ్చి ఓటీటీలో బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీ ‘హసీన్ దిల్రుబా’. బాలీవుడ్ భామ తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదలై మంచి రికార్డు వ్యూస్ సాధించింది. అయితే ఈ సూపర్ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’పేరుతో సీక్వెల్ రానుండగా ఫస్ట్ పార్ట్లో నటించిన విక్రాంత్ మాస్సే, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జయ్ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో పాటు ఒక ఫొటో కూడా పంచుకుంది. ఇక సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు సన్నీ కౌశల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.