Homeహైదరాబాద్latest NewsWGL: అందరూ చూస్తుండగా గొడ్డలితో దారుణంగా నరికాడు..

WGL: అందరూ చూస్తుండగా గొడ్డలితో దారుణంగా నరికాడు..

కౌకొండలో యువకుడి దారుణ హత్య…

మృతుడు దర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రదాన కార్యదర్శి

భూతగాదాలే కారణమా…!

ఇదే నిజం, వరంగల్ ప్రతినిధి: హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల యుగేందర్ (35) సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కౌకొండ గ్రామానికి చెందిన మేకల సారమ్మ ఇటివల మృతి చెందగా సోమవారం కుటుంబ సభ్యులు దశదినకర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా సారమ్మ జ్ఞాపకార్థం బంధుమిత్రులు చిందుకళాకారులతో కథ చెప్పించారు.

చిందు కళాకారుల కథను చూడడానికి వెళ్ళిన యుగంధర్ కొంతమంది మిత్రులతో కలిసి కథ జరుగుతున్న ప్రాంతంలో చలిమంట కాగుతున్నాడు. ఈ క్రమంలో మేకల సిద్దు అనే యువకుడు తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో యుగేందర్ పై విచక్షణారహితంగా దాడి చేయడంతో యుగంధర్ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలడు. దీంతో గ్రామస్తులు యుగేందర్ ను ప్రైవేట్ వాహనంలో పరకాలలోని సివిల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యుగంధర్ హత్యకు భూ సంబంధమైన పాత కక్షలే కారణంగా గ్రామస్తులు చర్చించుకోవడం గమనార్హం. నిందితుడు సిద్ధూని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img