Homeహైదరాబాద్latest NewsKGBV పాఠశాలను తనిఖీ చేసిన ప్రధానోపాధ్యాయుడు నర్సింహానాయక్

KGBV పాఠశాలను తనిఖీ చేసిన ప్రధానోపాధ్యాయుడు నర్సింహానాయక్

ఇదే నిజం, నల్లగొండ టౌన్ : తిప్పర్తి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్నిసేఫ్టీ అండ్ సెక్యురిటి ఆడిట్ కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పానుగోతు నర్సింహా నాయక్ తనిఖీ చేశారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకొనే భద్రత ప్రమాణాలు, పాఠశాల లో పారిశుధ్యం, భోజనం నాణ్యత, వంటగది, మూత్రశాలలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థుల పఠన నైపుణ్యాలను పరిశీలించి సంతృప్తి చెందారు. విద్యార్థులు అనుపస్థితి కాకూండా చూడాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆయన కోరారు. టీం సభ్యులు చిటుప్రోలు సదానందం, ప్రత్యేక అధికారిణి రాజేశ్వరి, సి ఆర్ టి లు పుష్పలత, పుణ్యవతి, జాకీరా, శంకరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img