Homeహైదరాబాద్latest Newsహీట్ వేవ్ అలెర్ట్.. ప్రజలు ఉక్కిరి బిక్కిరి

హీట్ వేవ్ అలెర్ట్.. ప్రజలు ఉక్కిరి బిక్కిరి

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఉదయం 10 దాటితే ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు బయపడుతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటిపట్టునే ఉన్న వారిని కూడా ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తొంది. తెలంగాణ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి హీట్ వేవ్స్ అలెర్ట్ ప్రకటించారు. ఎండ వేడిమితో పాటు వడగాలుల తీవ్రత పెరిగింది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతోంది.

రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చిన్న పిల్లలు, వృద్దుల పరిస్థితి వర్ణనాతీతం. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే.. ఇక మే నెలలో ఉష్ణోగ్రతలు ఎంత దారుణంగా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో విపరీతమైన వడగాలులు వీస్తున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు చల్లని పానియాలవైపు పరుగులు తీస్తున్నారు.

Recent

- Advertisment -spot_img