ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.7 కోట్ల విలువైన 11.40 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బట్టలు, శానిటరీ ప్యాడ్లు, ట్రాలీలు, లోదుస్తులు తదితర చోట్ల బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.