HomeSocial Mediaమందుబాబులా మజాకా..! వామ్మో.. మూడు రోజుల్లో

మందుబాబులా మజాకా..! వామ్మో.. మూడు రోజుల్లో

ఇదేనిజం, వెబ్ డెస్క్: న్యూఇయర్ వేళ తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో రూ.658 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ముందే ఈవెంట్స్ ఫిక్స్ చేసుకున్న వారితో పాటు… క్లబ్బులు, పబ్బులకు మద్యం భారీగా చేరింది. మద్యం విక్రయాల ద్వారా ఆదాయం భారీగా పెరిగింది. 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు… 6.31 లక్షల బీర్‌ కేసులు అమ్ముడయ్యాయి.

ఈసారి డిసెంబర్ 31 ఆదివారం రావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ షాపు వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. మందుతోపాటు,, మటన్, చికెన్, ఫిష్ లకు కూడా గిరాకీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత ఎక్కువగా మద్యం కొనుగోలు చేశారు. దుకాణాల్లో ఉన్న మద్యం పూర్తిగా అమ్ముడైపోవడంతో డిపోలు తెరిచి మరి వైన్ షాపులకు మందును సరఫరా చేసినట్లుగా సమాచారం. ఇలా ఏకంగా రూ. 658 కోట్ల మద్యం, బీరు విక్రయాలు జరిగాయని ఆబ్కారి శాఖ అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్ ను ఏర్పాటు చేసే పబ్బులు, క్లబ్బులు పెద్ద ఎత్తున ముందస్తుగానే మద్యం ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకున్నారు.

అంతేకాదు డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో విక్రయాలు భారీగా పెరిగాయి. మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. ఇక డిసెంబర్ 31 రాత్రి ఒంటిగంట వరకు కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకత అనుమతిని ఇవ్వడం కూడా ఈ విక్రయాలు పెరగడానికి దోహద పడింది. మందు ఒకటే సరిపోదు కదా.. దాంట్లోకి మంచింగ్ కూడా ఉండాలి. మందులో కలుపుకోవడానికి సోడానో, కూల్ డ్రింకో కావాలి.

కూల్ డ్రింక్స్ అమ్మకాలు కూడా భారీగా పెరిగినట్టుగా చెబుతున్నారు. మటన్, చికెన్, చేపలు మార్కెట్లో దొరకడమే గగనంగా మారిపోయిందట. నాన్ వెజ్ విక్రయాలు రాజధాని హైదరాబాద్లో విపరీతంగా జరిగాయి. మామూలు రోజుల్లో రోజుకు మూడు లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతుండగా.. డిసెంబర్ 31 ఆదివారం రావడంతో 4.5 లక్షల కిలోల చికెన్ అమ్ముడైందట. దాదాపుగా సగానికి ఎక్కువ శాతం అమ్మకాలు పెరిగాయి. డిమాండ్ పెరిగిన చికెన్ ధరలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు.

Recent

- Advertisment -spot_img