కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భారీ వర్షం కురుస్తోంది. గ్రౌండ్స్మెన్ కవర్లతో పిచ్ను కప్పి ఉంచారు. ప్రేక్షకులు తడుస్తూనే క్యూలో వేచి ఉన్నారు. మ్యాచ్ రద్దయితే చెరో పాయింట్ దక్కుతుంది. హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్కు చేరనుంది. గుజరాత్ ఇప్పటికే టోర్నీ నుంచి ఔట్ అయింది.