తెలంగాణాలో రానున్న ఐదు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏడు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి.. సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షం పడొచ్చని తెలిపింది. ఈరోజు సాయంత్రం హైదరబాద్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వివరించింది.