Homeక్రైంసెలవుల గొడవ.. టీచర్ ని కాల్చి చంపిన మరో టీచర్

సెలవుల గొడవ.. టీచర్ ని కాల్చి చంపిన మరో టీచర్

సీతాపుర్: పాఠశాల రిజిస్టర్‌లోని సాధారణం సెలవులకు సంబంధించిన ఎంట్రీపై ఇద్దరూ టీచర్ల మధ్య స్వల్ప వివాదం కాల్పుల వరకు వచ్చింది. ఇందులో ఓ టీచర్ ప్రాణాలు కోల్పోయింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని సీతాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) ఆర్.పి.సింగ్ ప్రకారం.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న 35 ఏళ్ల ఉపాధ్యాయురాలిని అదే పాఠశాల ప్రాంగణంలో ఆమెతో పని చేసే ఒక ఉపాధ్యాయుడు కాల్చి చంపారు.

ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగినట్లు ఎస్పీ తెలిపారు. మరణించిన ఉపాధ్యాయురాలు ఆరాధన రాయ్ గా పేర్కొన్నారు. ఇమెను అదే స్కూల్లో పనిచేసే సహోద్యోగి అమిత్ కౌశల్ రెండు సార్లు కాల్చారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

ఆరాధనకు కౌషల్‌ తో ఎఫైర్ ఉందని, అయితే వారి సంబంధాలు ఇటీవల దెబ్బతిన్నాయని అంటున్నారు. దీంతో ఆమె కౌశల్‌ పై పాఠశాల అధికారులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో అధికారులు విచారణ జరిపి, కౌషల్‌ కు హెచ్చరికలు జారీ చేశారు. ఇది మనసులో పెట్టుకునే సెలవుల వంకతో ఆమెను కాల్చిచంపాడని భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Recent

- Advertisment -spot_img