హైదరాబాద్ లోని బేగంబజార్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బేగంబజార్ తోప్ ఖానకు చెందిన రామేశ్వర్(39), సంతోషి దంపతుల మధ్య గొడవ అయినప్పుడల్లా భార్య ఉప్పుగూడలోని తల్లిగారింటికి వెళ్తుండేది. దీని కారణంగా సంతోషి తండ్రి ఉప్పల్లో ఆర్టీసీ బస్సు కిందపడి చనిపోయాడు. దీంతో బావ వల్లే తమ తండ్రి చనిపోయాడని సంతోషి సోదరులు..రామేశ్వర్, అతని తల్లి గంగూబాయిపై దాడి చేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.