HomeSocial Mediaఆ సినిమా అల్లు అర్జున్ తో తీయాలనుకున్నా: సందీప్ రెడ్డి వంగా

ఆ సినిమా అల్లు అర్జున్ తో తీయాలనుకున్నా: సందీప్ రెడ్డి వంగా

విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. మరోవైపు ఈ చిత్రం గురించి సందీప్ వంగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 

2011లో అల్లు అర్జున్ కి ఒక కథ చెప్పానని… అయితే కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయిందని సందీప్ చెప్పారు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ కథను రెడీ చేసుకుని, బన్నీకి వినిపిద్దామనుకున్నానని… అయితే, ఆయనను కలవడం కుదరలేదని తెలిపారు. ఆ స్క్రిప్ట్ ను పట్టుకుని చాలా మంది నిర్మాతలను కలిశానని… చివరకు తానే నిర్మించానని చెప్పారు. ఒక ఫ్రెండ్ ద్వారా తనకు విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడని… అల్లు అర్జున్ ని కలవడం కుదరకపోవడంతో చివరకు విజయ్ తో ‘అర్జున్ రెడ్డి’ సినిమాను నిర్మించానని తెలిపారు. 

13 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ తో సినిమాను తీసే అవకాశం వచ్చిందని సందీప్ చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాపై సందీప్ ఫోకస్ చేశారు. ‘స్పిరిట్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తో మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. 

Recent

- Advertisment -spot_img