హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆటగాళ్ల విషయంలో ICC కీలక నిర్ణయం తీసుకుంది.
15 ఏళ్లు నిండితేనే అరంగేట్రానికి అర్హుడని ప్రకటించింది.
కొన్ని అసాధారణ పరిస్థితుల్లో 15 కంటే వయసు తక్కువున్నా ఆటగాళ్లని ఆడించాలంటే బోర్డులు ICCకి దరఖాస్తు చేయాలని తెలిపింది.
ప్లేయర్ల రక్షణ కోసమే ఈ నిబంధన పెడుతున్నట్లు వెల్లడించింది.
పురుషులు, మహిళల అన్ని ICC ఈవెంట్లు, దైపాక్షిక సిరీస్లు, అండర్-19 క్రికెట్లోనూ ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొంది.