HomeరాజకీయాలుCongress కు అధికారమిస్తే చీకటి రాజ్యమే : KTR

Congress కు అధికారమిస్తే చీకటి రాజ్యమే : KTR

– మీ వైఫల్యాలను చూసేందుకు కర్ణాటక దాకా రావాలా?
– అక్కడ మీ పాలన ఎలా ఉందో తెలంగాణ జనానికి తెలుసు
– డీకే శివకుమార్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర

ఇదే నిజం, హైదరాబాద్: కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు, పరిగి, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం రాత్రి కాంగ్రెస్‌ నిర్వహించిన రోడ్‌షోల్లో బీఆర్ఎస్​ సర్కారుపై డీకే చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తిప్పికొట్టారు. తమ రాష్ట్రానికి వస్తే పథకాల అమలు చూపిస్తామంటూ డీకే శివకుమార్‌ చేసిన కామెంట్స్​కు కేటీఆర్‌ స్పందించారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే చీకటి రాజ్యమేనని కర్ణాటక దుస్థితిని చూసిన తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు. ఆదివారం ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తెలంగాణ భవన్​లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్​ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ అటాక్ చేశారు. ‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న మా రాష్ట్రానికి వచ్చి.. కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. డీకే గారూ.. అది మీ చేతకానితనానికి నిదర్శనం. ఓవైపు కర్ణాటక వాసులు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా.. తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా? మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే.. ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


కర్ణాటక వాసులు మిమ్మల్ని క్షమించరు

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని కర్ణాటక ప్రజలు క్షమించరని మంత్రి కేటీఆర్.. డీకే శివకుమార్​ను ఉద్దేశించి మండిపడ్డారు. ‘డీకే గారు.. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఎన్నికల ప్రచారంలో ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు.. ఛార్జీల వాతలతో కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయింది. కనీసం ఐదుగంటలు కూడా కరెంట్ లేక అక్కడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎడాపెడా పవర్ కట్‌లతో వాణిజ్య, వ్యాపార సంస్థలు కూడా కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మీ అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కింది. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన మీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు. రేషన్‌పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ అసమర్థ పాలనకు ఉన్న తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంది.’మంత్రి కేటీఆర్ తెలిపారు

మీ గహలక్ష్మీ స్కీమ్​కు గ్రహణం పట్టింది


మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి కర్ణాటక ఆర్టీసీని దివాళా తీసిన అక్కడి అధికార కాంగ్రెస్ సర్కారు విధానం ప్రజలకే కాదు.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న గృహలక్ష్మి హామీకి కూడా గ్రహణం పట్టిందన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న ప్రధాని మోడీ హామీలాగే కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు గంగలో కలిసిపోయాయన్నారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే కమీషన్ల కుంభమేళాకు తెర తీసిన కాంగ్రెస్ అవినీతి బాగోతాన్ని చూసి తెలంగాణ సమాజం మండిపడుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘కర్ణాటకలో అన్ని రంగాల్లో సంక్షోభానికి తెరతీసిన కాంగ్రెస్​ను నమ్మి మోసపోవడానికి తెలంగాణ జనం సిద్ధంగా లేరు. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డా’అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img