Homeఫ్లాష్ ఫ్లాష్వారు తగ్గితేనే.. మేమూ తగ్గుతమ్

వారు తగ్గితేనే.. మేమూ తగ్గుతమ్

న్యూఢిల్లీ: స‌రిహ‌ద్దుల నుంచి చైనా త‌మ ద‌ళాల‌ను తగ్గిస్తేనే.. తాము కూడా ద‌ళాల‌ను వెన‌క్కి పంపించ‌మ‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ మేరకు స్పష్టం చేశారు. ల‌డాఖ్ స‌రిహ‌ద్దులో చైనాతో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న విష‌యం తెలిసిందే.

చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించే న‌మ్మ‌కం ఉన్న‌దని, సరిహ‌ద్దుల్లో భార‌త్ త‌న మౌళిక‌స‌దుపాయాల‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు.

చైనాతో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌కు డెడ్‌లైన్ అంటూ ఏదీ లేదని, ఆ స‌మ‌స్య‌కు ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్పలేమన్నారు.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో చైనా ఓ గ్రామాన్ని నిర్మిస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పైన కూడా మంత్రి స్పందించారు. ఆ నిర్మాణం చాలా ఏళ్ల నుంచి సాగుతున్న‌ట్లు మంత్రి చెప్పారు.

Recent

- Advertisment -spot_img