Homeరాజకీయాలుఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే నష్టపోతం

ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే నష్టపోతం

– కర్ణాటకలో కాంగ్రెస్​కు ఓటేసిన జనం నరకం చూస్తున్నరు
– మంత్రి హరీశ్​ రావు విమర్శలు

ఇదే నిజం, హైదరాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటేసిన జనాలకు ఏ ఒక్క పథకమూ అందడం లేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఖజానా ఖాళీ అయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే చెబుతున్నారన్నారు. కర్ణాటక మోడల్‌ అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అక్కడ ఐదు గ్యారంటీలు అమలు చేయలేని వారు.. తెలంగాణలో ఆరు అమలు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే గుండెపోటు గ్యారెంటీ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌ మాట్లాడారు. ‘మూడు నెలల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్‌ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపారు. వారి మాటలు నమ్మి ఓటేసిన ప్రజలు అక్కడ నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ‘శక్తి’ పథకంలో శక్తి లేదు. గృహలక్ష్మి పథకంలో లక్ష్మి లేదు. అన్న భాగ్య పథకంలో అన్నం లేదు. గృహజ్యోతి పథకంలో జ్యోతి లేదు. ఈ హామీలు ఇచ్చిన రాహుల్‌ గాంధీ రాంరాం చెప్పివెళ్లిపోయారు. ప్రియాంక గాంధీ పత్తాలేరు. ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది. నిధులలేమితో కర్ణాటకలో స్టూడెంట్ల స్కాలర్‌ షిప్​లు తగ్గిస్తున్నారు. దాంతో ఉన్నత విద్య చదువుతున్న తల్లిదండ్రులపై భారం పడుతోంది. అందుకే తెలంగాణ విద్యార్థులు, యువత ఆలోచించాలి.


కర్ణాటకలో 6 నెలల్లో 350 మంది రైతులు ఆత్మహత్య


పాత రోడ్లకు రిపేర్లు చేయడానికే నిధుల్లేవని కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం చెబుతున్నారు. ఎమ్మెల్యేలు నిధులు అడగొద్దని అంటున్నారు. అభివృద్ధి పనులకు నిధులివ్వకపోతే మేమెలా ప్రజల్లోకి వెళ్లాలని 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర సీఎంకు లేఖ రాశారు. నియోజకవర్గాలకు వెళ్తే ప్రజలు నిలదీస్తారని తెలిసి వారు బెంగళూరు విడిచి వెళ్లడం లేదు. ఆరునెలల్లోపే 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లు మార్చే వారు లేక రైతులు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో పదేళ్ల కేసీఆర్‌ పాలనలో నేను రైతును అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి వచ్చాం. రైతులకే డబ్బులు చెల్లించేలా రైతుబంధు తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్‌. కాంగ్రెస్‌ నేతలు వన్‌ ఛాన్స్‌ అని వస్తారు. అధికారంలోకి వచ్చాక ఎక్స్‌క్యూజ్‌మీ ప్లీజ్‌ అంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మళ్లీ కేసీఆర్‌కే పట్టం కట్టాలి’అని హరీశ్ పిలుపునిచ్చారు.


డయ్యర్ సారీ చెప్పిన్నట్లుంది


ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం బీఆర్ఎస్​పై చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు వేసిన అమెరికా.. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మందిని కాల్చి చంపిన డయ్యర్‌ సారీ చెప్పినట్లు ఉంది. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన బిడ్డల తల్లిదండ్రులు కొరడాతో కొట్టినా మీ పాపం పోదు’అని హరీశ్‌ వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img