హైదరాబాద్: ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ముఖ్యంగా తెలంగాణ వాళ్లను తన బుట్టలో వేసుకుంది సాయిపల్లవి.
ప్రస్తుతం ఈ అమ్మడు ఇటు తెలుగు, అటు తమిళ, మలయాళ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
రీసెంట్గా సాయిపల్లవి నటించిన వెబ్ సిరీస్ ‘పావ కదైగల్’. నాలుగు కథల సమాహారంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ను విఘ్నేశ్ శివన్, సుధాకొంగర, గౌతమ్ మీనన్, వెట్రిమారన్ తెరకెక్కించారు.
డిసెంబర్ 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తండ్రి పాత్రల ప్రకాశ్రాజ్తో కలిసి నటించడానికి భయపడ్డానని, ఆయన గంభీరత చూసి ఆ భయం కలిగేదని, సెట్లో ఉండేటప్పుడు ఆయన పాత్రలోనే ఉండేవారని ప్రకాశ్రాజ్ గురించి తన అభిప్రాయాన్ని సాయిపల్లవి పేర్కొంది.
డాక్టర్ కోర్సు చదివి యాక్టర్ అయిన సాయిపల్లవిని..మరి డాక్టర్గా మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు అని అడిగితే.. సినిమాల నుండి రిటైర్ అయిన తర్వాత వైద్యవృత్తిపైనే దృష్టిపెడతా అని సమాధానమిచ్చింది సాయిపల్లవి.