Homeహైదరాబాద్latest Newsమియాపూర్ లో 144 సెక్షన్ అమలు.. ఉల్లంగిస్తే తాట తీస్తామని సైబరాబాద్ సీపీ అవినాష్

మియాపూర్ లో 144 సెక్షన్ అమలు.. ఉల్లంగిస్తే తాట తీస్తామని సైబరాబాద్ సీపీ అవినాష్

అసత్యప్రచారమే అయినా గూడు కోసం పోరాటం.
ప్రభుత్వ భూమి ఆక్రమణ  కోసం గుడిసెలు వేసే ప్రయత్నం.
వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఎగబడుతున్న జనం.
క్రమంగా వందల్లో ఉన్న ఆశావహులు వేలల్లోకి మారిన వైనం.
ఆదివారం ఉదయం పరిస్థితి సమీక్షించిన సైబరాబాద్ సీపీ.ఇదేనిజం, శేరిలింగంపల్లి: అది అక్షరాలా ప్రభుత్వ భూమే అని జగమెరిగిన సత్యం. అందులో కొంత భాగం ప్రైవేట్ వ్యక్తులు కొనగా వారికి ప్రభుత్వానికి మధ్య కోర్టులో కేసులు నేటికీ నడుస్తున్నాయి. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో నేటికీ అవి అలాగే ఉన్నాయి. ప్రభుత్వం సుమారు 508 ఎకరాలు ఉన్న ఆ స్థలం రక్షణ బాధ్యతను హెచ్ఎండీఏ కు అప్పగింగించి. కొన్నేళ్లుగా వారే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా కాపలాగా ఉంటున్నారు. అయితే ఇటీవల స్థానికంగా ఉండే ఓ మహిళ నాయకురాలు ఆధ్వర్యంలో లోకల్ మహిళలతో కలిసి  మీటింగ్ పెట్టి ప్రభుత్వ స్థలంలో కొన్ని గుడిసెలు వేసి ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తే కనీసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అయినా ఇవ్వకపోరా అని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కొన్ని రోజుల పాటు వారంతా స్టాలిన్ నగర్ ను ఆనుకోని ఉన్న స్టాలంలోకొంత మంది గుడిసెలు వేసే ప్రయత్నం వేశారు. అప్పుడు కేవలం  వందల సంఖ్యలో మహిళలు ఉండడంతో హెచ్ఏండీ ఏ అధికారులు, స్థానిక పోలీసులు నచ్చ చెప్పడంతో పగలు అక్కడినించి వెళ్ళిపోయినా గూడు వస్తుందనే ఆశతో రాత్రి పూట అక్కడే ఉండసాగారు.

వారం తిరిగేలోపూ సీన్ రివర్స్ అయ్యింది.

అప్పటివరకు స్థానికంగా ఉన్నవారే గుడిసెల ప్రయత్నం చేయగా అలా ఒక వారం గడిచిందో లేదో దావానలంలా ఇండ్ల స్థలాలు ఇస్తున్నారనే ప్రచారం జోరుగా జరగడంతో చిలికి చిలికి గాలివానలా  వందల కిలోమీటర్ల వరకు వ్యాపించింది. దీంతో  సుమారు వందల కిలోమీటర్ల నుంచి  సొంత ఆటోలు వాహనాల్లో ఆశావాహులు  ఇక్కడికి చేరుకోసాగారు. దూరం నుంచి స్థానికేతరులకు కండ్ల ముందు వందల ఎకరాల స్థలం కనిపించడంతో వారికి ఎట్లగైనా సొంత గూడు ఏర్పరుచుకోవాలనే కోరిక మరింత బలమయ్యింది. అది ముమ్మాటికీ ప్రభుత్వ భూమి అని హెచ్ఎండీఏ  అధికారులు నెత్తి నోరు కొట్టుకున్నా వారు అక్కడినించి వెళ్లేందుకు  ససేమీరా అంటుండంతో  అధికారులకు ఏమీ చేయాలో అర్ధం కావడం లేదు.

రెండు మూడు రోజుల్లోనే వందల నుంచి వేలల్లోకి చేరిన వైనం.

గుడిసెలు వేసుకుంటే పోలీసులు,హెచ్ ఎండీ ఏ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఓ గుడిని కట్టే ప్రయత్నం కూడా చేయడం గమనార్హం. అయితే వాటిని అడ్డుకున్నారు. అయితే పరిస్థితి గురువారం వరకు అదుపులోనే ఉన్నది. అయితే శుక్రవారం ఉన్నట్టుండి వేలాదిగా గుడిసెలు వేసేందుకు రావడంతో ఒక్కసారిగా ఆక్రమణ దారులకు, పోలిసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. ఒకానొక సమయంలో పోలీసుల పైకి రాళ్ళు రువ్వడంతో పరుగులు పెట్టడం పోలీసుల వంతు అయ్యింది.

ఆదివారం ఉదయం మియాపూర్ చేరుకున్న సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పరిస్థితిని సమీక్షించారు. మియాపూర్ 100, 101 సర్వే నంకోర్టు ఉత్తర్వులు అములో ఉన్న ప్రభుత్వ భూమిలో ప్రాంతంలో ఎవరు ప్రవేశించినా అరెస్టులు ఉంటాయన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. చట్టాన్ని ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img