Homeఫ్లాష్ ఫ్లాష్సాయి మందిరంలోవైభవంగా దత్త జయంతి వేడుకలు

సాయి మందిరంలోవైభవంగా దత్త జయంతి వేడుకలు

– 2000 మంది భక్తులకు అన్నదానం

ఇదే నిజం, నాగార్జున సాగర్: విజయపురి సౌత్ లోని సత్యసాయి ప్రేమ మందిరంలో దత్త జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఉ సాయి హరిప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం వైభవంగా వేడుకలు సాగాయి. అర్చకులు హనుమాచారి, వీరాచారి ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం 5:15 నిమిషాలకు కాగడ హారతి, షిరిడి సాయిబాబా మంగలస్నానము నిర్వహించారు. 11 గంటలకు స్వామి వారిని పల్లకి లో గ్రామ పురవీధుల్లో ఊరేగింపు జరిపారు. 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భజన మండలి సభ్యులచే సాయి ఏకాహం నిర్వహించారు. మధ్యాహ్నం 2000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భజన మండలి సభ్యులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ములకా జానారెడ్డి, గొంతిన సాయిరాం, జీవిజీ కృష్ణమూర్తి, రామకృష్ణ, పవన్ కుమార్, సుధాకర్, నాగరాజు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img