ఇదేనిజం, గద్వాల : జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలో వెలసిన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నూతన ముఖద్వారాన్ని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. అదేవిధంగా దేవాలయం ప్రాంగణంలో మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకుడు సత్య రెడ్డి తల్లిదండ్రులు వెంకటమ్మ, చిన్న వెంకట రెడ్డి జ్ఞాపకార్థంగా ఏర్పాటుచేసిన అన్నదానం షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో జరగబోయే జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు, బీఆర్ఎస్ నాయకులు విక్రమ్ సింహారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మధు, నరేందర్ పాల్గొన్నారు