Homeతెలంగాణ50 మందితో.. 20 నిమిషాల్లో ముగించాలి

50 మందితో.. 20 నిమిషాల్లో ముగించాలి

ఆగష్టు 15 వేడుకలపై హైకోర్టు మార్గదర్శకాలు
న్యాయస్థానాల్లో ఆగస్టు 15న నిర్వహించే వేడుకలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 50 మందికి మించి పాల్గొనవద్దని మార్గదర్శకాల్లో నిర్దేశించింది. అదేవిధంగా వేడుకలను 20 నిమిషాల్లో ముగించాలని సూచించింది. ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టవద్దని మార్గదర్శకాల్లో పేర్కొంది. స్వాతంత్ర దినోత్సవం నాడు పాల్గొనేవారు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. మాస్కులను ధరించడం తో పాటు భౌతిక దూరం పాటిస్తూ చేతులను తరచుగా శానిటైజ్ చేసుకోవాలని సూచించింది.

Recent

- Advertisment -spot_img