చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 580 టెస్టులు ఆడిన భారత్.. 179 విజయాలు సాధించింది. మరో 178 ఓటములు, 222 మ్యాచ్లను డ్రా, ఒకటి టైగా ముగించింది. దీంతో అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన నాలుగో టీమ్ గా భారత్ నిలిచింది. ఈ 92 ఏళ్లలో కనీసం ఒక్కసారి కూడా టెస్టుల్లో ఓటముల కంటే ఎక్కువ విజయాల్ని భారత్ నమోదు చేయలేకపోయింది. ఈరోజు చెపాక్లో 179వ టెస్టు విజయాన్ని అందుకున్న టీమిండియా ఆ రికార్డ్ని అందుకుంది.