HomeTelugu NewsWGL : ఫోన్‌లో వైద్యం..శిశువు మృతి

WGL : ఫోన్‌లో వైద్యం..శిశువు మృతి

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు ఆన్‌లైన్ వైద్యం చేశారు. డాక్టర్ అందుబాటులో లేరంటూ నర్సులే ప్రసవం చేశారు. ఈ దారుణ ఘటన జిల్లాలోని వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. డాక్టర్ సలహా తీసుకుంటూ నర్సులు వైద్యం చేశారు. తల్లి క్షేమంగానే ఉన్నా పుట్టిన ఒక రోజుకే శిశువు మరణించింది. ఆ బిడ్డ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img