HomeSocial Media‘కాళేశ్వరం అక్రమాలపై విచారణ START’

‘కాళేశ్వరం అక్రమాలపై విచారణ START’

కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లోని జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులు, నీటి విడుదల అంశాలపై మంత్రి మాట్లాడారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై ఇంజినీర్లతో చర్చించిన మంత్రి జూన్ నాటికి కొత్తగా 50 వేలు, డిసెంబర్ నాటికి 4.5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సకాలంలో నీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఈఎన్ సీలు, సీఈలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img