Homeఫ్లాష్ ఫ్లాష్IPL-2024: ఐపీఎల్‌లో నేడు ఆసక్తికర పోరు.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

IPL-2024: ఐపీఎల్‌లో నేడు ఆసక్తికర పోరు.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

IPL-2024 లీగ్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాతి దశకు చేరుకున్నాయి. మిగిలిన బెర్త్ కోసం బెంగళూరు వేదికగా ఈరోజు సీఎస్‌కే, ఆర్సీబీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో CSK గెలిస్తే నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. అయితే ఆర్‌సీబీ ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే నెట్ రన్ రేట్ కీలకం. RCB ముందుగా బ్యాటింగ్ చేసి 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే, CSK 182 పరుగులకే పరిమితం కావాలి. వర్షం కారణంగా ఓవర్లు కుదించబడితే, వారు 10 ఓవర్లలో 130 పరుగులు చేసి CSKని 112 పరుగులకు ఆలౌట్ చేయాలి. 201 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.1 ఓవర్లలో ఛేదించాలి. 10 ఓవర్లలో 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 8.1 ఓవర్లలోనే పూర్తి చేయాలంటే బెంగళూరు ప్లే ఆఫ్‌కు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటం ఆర్సీబీని కలవరపరుస్తోంది. ఎందుకంటే.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో చెన్నైపై ఆర్సీబీ కచ్చితంగా గెలిచి తీరాలి. అలాగే ఆ జట్టు కంటే మెరుగైన రన్‌రేట్ సాధించాలి. మరోవైపు ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని భావిస్తున్న తరుణంలో మరోసారి ఫైనల్ చేరి కప్ కొట్టాలని తలా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img