Homeహైదరాబాద్latest Newsరైసీ మృతికి సంతాపంగా భారత్‌లో ఇరాన్ జెండాల అవనతం

రైసీ మృతికి సంతాపంగా భారత్‌లో ఇరాన్ జెండాల అవనతం

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలు సంఘీభావాన్ని తెలిపాయి. సంతాపాన్ని ప్రకటించాయి.

రైసీ మృతి నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అయిదు రోజుల సంతాపం తెలిపింది. ఈ అయిదు రోజుల పాటు ఎలాంటి అధికారిక కార్యక్రమాలను నిర్వహించట్లేదని పేర్కొంది. మతపరమైన కార్యక్రమాలు, సమావేశాలను కూడా జరపకూడదని సూచించింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ ఓ ప్రకటన విడుదల చేశారు.

మరోవంక- భారత్‌లో అన్ని చోట్లా కూడా ఇరాన్ జాతీయ జెండాలను అవనతం చేశారు. రైసీ మృతికి సంతాప సూచకంగా ఇరాన్ రాయబార కార్యాలయం, కాన్సులేట్ జనరల్ ఆఫీస్, హైకమిషనర్ కార్యాలయాలపై ఎగురవేసిన ఆ దేశ జాతీయ పతాకాలను అవనతం చేశారు. అయిదు రోజల పాటు వాటిని అలానే ఉంచనున్నారు.

Recent

- Advertisment -spot_img