విదేశీ ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ కోసం ఐపీఎల్ ను కీలక దశలో వదిలి వెళ్లడాన్ని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తప్పుబట్టారు. ‘సీజన్ మొత్తం అందుబాటులో ఉండండి. లేదంటే రావద్దు!’ అని ఘాటైన ట్వీట్ చేశారు. టీ20 ప్రపంచకప్ జూన్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెటర్లు బట్లర్, జాక్స్ వంటి ప్లేయర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. వీరంతా ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడాల్సి ఉంది.