టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్ గ్రూప్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టింది. జట్టు ప్రదర్శనపై కోచ్ గ్యారీ క్రిస్టెన్ పాక్ ఆటగాళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో సెలక్షన్ కమిటీపై పీసీబీ చర్యలు చేపట్టింది. తాజాగా పాక్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది గురించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కోచ్ క్రిస్టెన్తో అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.