Homeహైదరాబాద్latest Newsఆ విషయం కారణంగానే ప్రభుత్వం తగ్గిందా?

ఆ విషయం కారణంగానే ప్రభుత్వం తగ్గిందా?

రాష్ట్ర అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ దాదాపు 200 సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా చిహ్నాన్ని, రాష్ట్ర గీతాన్ని ఒకేసారి ఆవిష్కరించాలనుకున్నారు. కాకతీయ తోరణాన్ని తీసేస్తే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుందనే కారణంతోనే వాయిదా వేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న కాకతీయుల వైభవాన్ని, ఆనవాళ్లను తీసేస్తే ప్రజల నుంచి ముఖ్యంగా వరంగల్ వాసుల నుంచి పార్టీలకతీతంగా అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కాస్త తగ్గినట్లు కనబడుతోంది.

Recent

- Advertisment -spot_img