Homeసినిమామూడోది ముంచిందా?

మూడోది ముంచిందా?

త్రివిక్రమ్, మహేశ్​ బాబు కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా వంటి సినిమాల తరువాత వస్తున్న సినిమా కావడంతో, సినీ ఆడియన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు. కానీ, థియేటర్ల దగ్గర వస్తున్న టాక్ వింటుంటే మాత్రం, గుంటూరు కారం.. అంచనాలను అందుకోలేకపోయింది అనే అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే విషయాన్నీ ప్రస్థావిస్తూ, సోషల్ మీడియాలో కొత్త టాపిక్ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ మూడు సినిమాలను తీశాడు. జల్సా డీసెంట్ హిట్ గ నిలవగా, అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తరువాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అజ్ఞాతవాసి, భారీ డిజాస్టర్ గా నిలిచింది.

పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన తప్పిదమే యిపుడు, గుంటూరు కారం సినిమాకు జరిగిందా అంటూ, సినీ విశ్లేషకులు తమ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా త్రివిక్రమ్ మూడు సినిమాలు చేశాడు. జులాయి సినిమా సూపర్ హిట్ కాగా, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక వీరి కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీగా, అల వైకుంఠపురములో సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా జెండా ఎగరేసింది. డైరెక్టర్ త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాలకు చేసిన న్యాయం, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకు చేయలేకపోయాడే అని గురూజీ ఫ్యాన్స్ డల్ గా ఫీలవుతున్నారు. త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజాలను మించి గుంటూరు కారం ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసిన ఫ్యాన్స్.. కూసింత నిరాశలో థియేటర్ల నుంచి బయటకు రావడం ఈ చర్చకు ఆజ్యం పోసింది. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో ఉన్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నాలుగో సినిమాకు సిద్దమవుతున్నాడు.

Recent

- Advertisment -spot_img