సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్ హాస్టల్లో కలుషిత ఆహారం విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. చట్నీ, సాంబారులో ఎలుకలు కనిపించిన ఘటన కలకలం రేపింది. అయితే జేఎన్టీయూ కళాశాల క్యాంటీన్లోని చట్నీలో పడిన ఎలుక ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు. చట్నీ పాత్రలో ఎలుక పడలేదని స్పష్టం చేశారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనిపించిందని పేర్కొన్నారు. కొందరు విద్యార్థులు కావాలనే ఆ పాత్రలో ఉన్న ఎలుకను వీడియో తీసి వైరల్ చేశారని పేర్కొన్నారు.