– అధికార పక్షాన్ని నిలదీస్తాం
– సమస్యలు ఎత్తిచూపుతాం
– మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలా ఫలకాలు కూల్చడం సరికాదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం మారినంత మాత్రాన గత ప్రభుత్వ నిర్మాణాలు ధ్వంసం చేయడం సరికాదన్నారు. తాము అధికార పక్షాన్ని నిలదీస్తూనే ఉంటామని పేర్కొన్నారు. కచ్చితంగా సమస్యలు ఎత్తిచూపుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో భవనాలు నిర్మిస్తే కూల్చేస్తారా? అని నిలదీశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదన్నారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ ఏర్పాటు శిలాఫలకాలను తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చేసిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విపరీత ధోరణి కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.