Homeజిల్లా వార్తలుదారుణం.. పిల్లలు పుట్టలేదని..

దారుణం.. పిల్లలు పుట్టలేదని..

ఇదే నిజం, ఎండపల్లి : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమకు సంతానం కలగడం లేదని ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామానికి చెందిన బోయిని లక్ష్మణ్(40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మణ్ రెండెళ్ల క్రితం మొదటి భార్యతో విడాకులు కాగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండు సంవత్సరాల నుంచి సంతానం కలగకపోవడంతో లక్ష్మణ్ తీవ్ర మనస్థాపానానికి గురయ్యాడు. భార్యతో సంతానం కావడం లేదని తరుచుగా చెప్పుకొని బాధపడేవాడు.

బుధవారం రోజున రాత్రి సుమారు 7:30 గంటల ప్రాంతంలో లక్ష్మణ్ ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు లక్ష్మణ్ ను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పిల్లలు పుట్టడం లేదని జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని భార్య కవిత ఇచ్చిన పిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు వెల్గటూర్ మండల ఎస్సై శ్వేత తెలిపారు

Recent

- Advertisment -spot_img