Homeఆంధ్రప్రదేశ్jagan: ఇనార్బిట్‌ మాల్‌తో 8,000 మందికి ఉపాధి

jagan: ఇనార్బిట్‌ మాల్‌తో 8,000 మందికి ఉపాధి

ఇనార్బిట్‌ మాల్‌తో 8,000 మందికి ఉపాధి

  • మాల్‌ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారిపోతాయి
  • ఏపీ సీఎం జగన్

jagan: ఇదేనిజం, స్టేట్ బ్యూరో: ఇనార్బిట్‌ మాల్‌తో 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రెండున్నర ఎకరాలను ఐటీ కోసం కేటాయిస్తారని, విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు అని తెలిపారు. విశాఖ అభివృద్ధికి ఈ మాల్‌ దోహదపడుతుందని, మాల్‌ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారిపోతని పేర్కొన్నారు. ముందుగా కైలాసపురం వద్ద ఇనార్బిట్‌ మాల్‌కు భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో 15 ఎకరాల స్థలంలో మాల్‌ను నిర్మిస్తున్నారు.

జీవీఎంసీ చేపట్టిన రూ. 136 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. విశాఖపట్నం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు పూల వర్షంతో విశాఖ వాసులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ది పనులు చూసి ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు మహిళలు భారీగా తరలి వచ్చారు. దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌కు విశాఖ వేదికైంది. 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో కె.రహేజా గ్రూపు అభివృద్ధి చేయనున్న ఇనార్బిట్‌ మాల్‌ తొలి దశ పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భూమి పూజ నిర్వహించారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం కానుంది. దీనికి అదనంగా పార్కింగ్‌ కోసం ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img