భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా అవతరించింది. చైనా మొబైల్ సంస్థ రెండో స్ధానానికి పడిపోయింది. 2024 మార్చి నాటికి జియో 48.18 కోట్ల చందాదారులను కలిగి ఉంది. అందులో 10.8 కోట్ల మంది జియో 5జీను వాడుతున్నారు. ఈ సంఖ్య భారతీయ టెలికాం మార్కెట్లో జియో బలమైన స్థానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం జియో నెట్వర్క్ మొత్తం ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్లకు చేరుకుంది. వాస్తవానికి ఈ డేటా ఏటా 35.2 శాతం వరకు పెరుగుతోంది. 5G, హోమ్ సర్వీస్లు క్రమంగా పెరుగుతుండడమే ఇందుకు కారణం.