HomeSocial Media15 స్టేట్స్.. 100MP, 337MLA స్థానాలు.. 67డేస్.. జోడో న్యాయ్ యాత్ర విశేషాలివే..

15 స్టేట్స్.. 100MP, 337MLA స్థానాలు.. 67డేస్.. జోడో న్యాయ్ యాత్ర విశేషాలివే..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ కాసేపట్లో మణిపూర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రం మొత్తం 15 రాష్ట్రాలు, 100 లోక సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాలు, 110 జిల్లాల మీదుగా కొనసాగనుంది. 6700 కిలోమీటర్లు సాగనున్న ఈ యాత్రం 67 రోజుల పాటు కొనసాగుతోంది. లోక్ సభకు ఎన్నికలకు ముందు జరగుతోన్న ఈ యాత్ర గురించి కాంగ్రెస్ మాట్లాడుతూ.. మోడీ పదేళ్ల ‘అన్యాయ్ కాల్’కి వ్యతిరేకంగా జరుగుతోన్న యాత్రగా దీన్ని అభివర్ణించింది.

ఈశాన్య రాష్ట్రాల్లో ప్రారంభమవుతున్న ఈ యాత్ర మార్చి 20న మహారాష్ట్రలో ముగుస్తుంది. జోడో న్యాయ్ యాత్ర ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతోంది. రాష్ట్రంలో 20 జిల్లాల మీదుగా 1074 కిలోమీటర్లు 11 రోజుల పాటు సాగుతోంది. జార్ఖండ్, అస్సాంలో 8రోజుల చొప్పున, మధ్యప్రదేశ్ లో 7 రోజులపాటు యాత్ర కొనసాగుతుంది.

అత్యధిక లోక్ సభ స్థానాలున్న యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియోజకవర్గం వారణాసిలోనూ రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. బీహార్‌లో ఏడు జిల్లాలు, ఝార్ఖండ్‌లో 13 జల్లాలను కవర్ చేసే రాహుల్ యాత్ర ఆయా జిల్లాల్లో వరుసగా 425 కిలోమీటర్లు, 804 కిలోమీటర్లు కొనసాగుతుంది.

Recent

- Advertisment -spot_img