నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను నేడు విడుదల చేయనున్నారు. ‘కల్కి 2898 AD’ మూవీ నుంచి నటి శోభన పోస్టర్ను టీమ్ పంచుకుంది. ఈ పోస్టర్ కింద ఆమె పూర్వీకులు కూడా ఆమె లాగే వేచి ఉన్నారు అంటూ రాసుకోచ్చింది. అయితే పోస్టర్ లో శోభన ను చుస్తే బాహుబలి లో దేవసేన గుర్తుస్తోంది అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.