Homeహైదరాబాద్latest Newsజాతీయస్థాయిలో సత్తాచాటిన కరీంనగర్ విద్యార్ధి

జాతీయస్థాయిలో సత్తాచాటిన కరీంనగర్ విద్యార్ధి

ఇదే నిజం, జగదేవ్‌పూర్ : కరీంనగర్‌కు చెందిన గర్నేపల్లి శ్రీహర్ష జాతీయస్థాయి యోగాసన పోటీల్లో అసమాన ప్రతిభ కనపరిచాడు. వర్షిణి యోగా ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ స్పోర్ట్స్ ట్రస్ట్, కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. శ్రీహర్ష ప్రస్తుతం కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్‌లో అయిదో తరగతి చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన శ్రీహర్షను జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్‌ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ లీలా ప్రసాద్ , యోగా కోచ్ కృష్ణయ్య అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా రాణించి మరిన్ని పథకాలు తీసుకువస్తాడని వారు ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Recent

- Advertisment -spot_img