Homeహైదరాబాద్latest NewsWelfare schemes : పథకాలు అందరికీ చేరాలి

Welfare schemes : పథకాలు అందరికీ చేరాలి

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: ఇటీవల జరిగిన కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచిన గణేష్ కి వారి నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజనసంగం (ఏ.ఐ.ఏ.వై.యస్) అధ్యక్షులు కర్కనాగరాజు వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలోనే ఏకైక దళిత శాసనసభ్యులుగా భారీ మెజారిటీ తో గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు అందే విదంగా ఎమ్మేల్యే కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకి రవీందర్ బాబు , అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శులు కుతాడి కృష్ణా, సదామహేష్, ప్రీతం, కర్క మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img