Homeహైదరాబాద్latest Newsపెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై.. కర్ణాటక బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై.. కర్ణాటక బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా కర్ణాటక బీజేపీ నేడు “సైకిల్ జాతా” నిర్వహించింది.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర నేతృత్వంలో బిజెపి కార్యకర్తలు, నాయకులు పార్టీ రాష్ట్ర కార్యాలయం ‘జగన్నాథ్ భవన్’ నుండి ‘విధాన సౌధ’ వరకు సైకిల్‌పై ప్రయాణించి తమ నిరసనను తెలియజేసేందుకు ప్రయత్నించారు.అయితే, పోలీసులు ఆందోళనకారులను మార్గమధ్యంలో ఆపి, విజయేంద్ర మరియు ఇతరులను అదుపులోకి తీసుకొని బస్సులో తరలించారు.మాజీ ఉపముఖ్యమంత్రి సిఎన్‌ అశ్వత్నారయణ్‌, ఎమ్మెల్సీ సిటి రవి తదితరులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలో పాల్గొన్నారు, గత వారం పెట్రోల్‌పై పన్నును లీటరుకు రూ.3, డీజిల్‌పై వరుసగా రూ.3.5 పెంచారు.

Recent

- Advertisment -spot_img