హైదరాబాద్ః ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న కారుణ్య తల్లి జానకి(70) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. పరిమిత సంఖ్యలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో సైదాబాద్ శ్మశాన వాటికలో జానకి అంత్యక్రియలు జరిగాయి. బాలాపూర్ మండలం మీర్పేట్లోని త్రివేణినగర్లో కారుణ్య పేరెంట్స్ ఉంటారు. తల్లి జానకి బీడీఎల్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందగా తండ్రి మధు సైతం డిఫెన్స్లోనే పనిచేసి రిటైర్ అయ్యారు.