Warangal : మరికాసేపట్లో వరంగల్ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి తాటికొండ రాజయ్యను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందినట్లు సమాచారం. కేసీఆర్ ఆదేశిస్తే తాను పోటీకి దిగుతానని రాజయ్య ఇదివరకే స్పష్టం చేశారు. మరోవైపు కొందరు ఉద్యమకారులు సైతం టికెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.