Homeహైదరాబాద్latest NewsKCR​..దమ్ముంటే మహబూబ్​నగర్​ MP గా పోటీ చేయ్​

KCR​..దమ్ముంటే మహబూబ్​నగర్​ MP గా పోటీ చేయ్​

– కాంగ్రెస్​ నేత వంశీచంద్​ రెడ్డి లేఖ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ కు దమ్ముంటే మహబూబ్​ నగర్​లో పోటీ చేయాలంటూ కాంగ్రెస్​ నేత వంశీచంద్​ రెడ్డి సవాల్​ విసిరారు. ఈ మేరకు ఆయన కేసీఆర్​ కు బహిరంగ లేఖ రాశారు. మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్​రెడ్డి పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. మరోవైపు ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరన్నది సస్పెన్స్​ గా మారింది. డీకే అరుణ, జితేందర్​ రెడ్డి ఈ టికెట్​ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్​ రెడ్డి బీఆర్ఎస్​ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. దీంతో మాజీ మంత్రులు నిరంజన్​ రెడ్డి, లక్ష్మారెడ్డి లేదంటే శ్రీనివాస్ గౌడ్​ కు బీఆర్ఎస్​ టికెట్ దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా వంశీచంద్ రెడ్డి .. కేసీఆర్​ ను పోటీ చేయాలని సవాల్​ విసరడం గమనార్హం. 2009 పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్​ ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

Recent

- Advertisment -spot_img