Homeహైదరాబాద్latest NewsKP Viveka Nanda : నియోజక అభివృద్ధే ధ్యేయం

KP Viveka Nanda : నియోజక అభివృద్ధే ధ్యేయం

– ఎమ్మెల్యే కేపీ వివేకానంద

ఇదేనిజం, కుత్బుల్లాపూర్ : నియోజక అభివృద్ధే తన ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఆదివారం 132-జీడిమెట్ల డివిజన్ గాయత్రినగర్ కాలనీలో రూ.36 లక్షలతో నూతనంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే వివేకానంద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన కుత్బుల్లాపూర్ ప్రజలకు, గాయత్రినగర్ కాలనీవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు అధిక నిధులు వెచ్చిస్తూ కాలనీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎల్లా గౌడ్, శ్రీదేవి రెడ్డి, గాయత్రీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుమేర్ సింగ్, అచ్యుత్ రావు, శర్మ, రాజు, విజయ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, వయొలెట్ జార్జి, సంతోషి, సుధ, సంధ్య, రేణుక, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img