HomeTelugu Newsసైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’..

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’..

వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘కృష్ణమ్మ’. ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. రూరల్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా వారం వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చి షాకిచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అర్చన అయ్యర్ నటించిన ఈ సినిమాలో లక్ష్మణ్‌ మీసాల, కృష్ణ బురుగుల, అతీరా రాజ్, రఘు కుంచె కీలక పాత్రలు పోషించారు.

Recent

- Advertisment -spot_img