HomeతెలంగాణKTR:కేసీఆర్ నాయకత్వంలో అద్భుత ప్రగతి-మంత్రి కేటీఆర్

KTR:కేసీఆర్ నాయకత్వంలో అద్భుత ప్రగతి-మంత్రి కేటీఆర్

KTR:తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండీస్ట్రియల్ పార్క్ లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం లో ఐటి ,పరిశ్రమల మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పర్యావరణం,పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగిందన్నారు. పరిశ్రమల ఏర్పాటు లో అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు TS ఐ పాస్ విధానంలో 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ, అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదు అని అక్కడి పారిశ్రామిక వేత్తలు చెప్పారన్నారు మానవ చరిత్రలో మూడవ అతి పెద్ద కార్యక్రమం మన హరితహారం కార్యక్రమమని వెల్లడించారు. ..తెలంగాణ లో మారు మూల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఇవ్వాళ సంతోషంగా ఉన్నరని అన్నారు. తెలంగాణను అవహేళన చేసిన వాళ్ళు కనుమరుగు అయ్యారని విమర్శించారు సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ ని పొగిడారని ఆయన ఎన్నో దేశాలు తిరిగి ,మన హైదరాబాద్ అత్యద్భుతంగా అభివృద్ధి జరిగిందని కితాబు ఇచ్చారని గుర్తుచేశారు గుజరాత్ రాష్ట్రంలో ఈ రోజుకు కూడా కరంట్ కోతలు ఉన్నాయని ,తెలంగాణాలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పారు . భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి మన కేసీఆర్ అన్నారు. 60 ఏళ్లలో జరిగిన పని ఈ తొమ్మిది ఏళ్లలో మన ముఖ్యమంత్రి చేసి చూపారని కొనియాడారు కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర దేశాలకు పాఠాలు నేర్పుతుందని అమెరికా ఇంజనీర్లు అన్నారు..అది తెలంగాణ కు దక్కిన గొప్ప గౌరవం అన్నారు. ఎగుమతులను పెంచామని ,ధాన్యం దిగుబడులు రికార్డ్ స్థాయిలో వస్తున్నాయన్నారు.దండుమల్కాపూర్ పార్క్ లో ఏర్పాటు చేసిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ లో వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు
.

Recent

- Advertisment -spot_img