– పీసీసీ చీఫ్ పోస్ట్ అమ్ముకున్న పార్టీ కాంగ్రెస్
– ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్
ఇదేనిజం, హైదరాబాద్: అవినీతి గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ పోస్ట్ను అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. ‘టికెట్లు అమ్ముకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టుకొని రాహుల్ అవినీతి గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారని గుర్త చేశారు. ఒకరు పీసీసీ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారు. ఇంత అవినీతి పార్టీలో ఉన్న రాహుల్.. అక్రమాలపై మాట్లాడటం హాస్యాస్పదం’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.