HomeరాజకీయాలుKTR : కారెక్కండి.. కలిసి పనిచేద్దాం

KTR : కారెక్కండి.. కలిసి పనిచేద్దాం

– సముచిత స్థానం కల్పిస్తాం..
– పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి కేటీఆర్​
– సీఎం కేసీఆర్​ సూచన మేరకు బీఆర్​ఎస్​లోకి ఆహ్వానం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి కేటీఆర్​ భేటి అయ్యారు. శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్​, దాసోజు శ్రవణ్​తో కలిసి కేటీఆర్​ హైదరాబాద్​లోని పొన్నాల నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​ పార్టీలోకి రావాలని లక్ష్మయ్యను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ సూచన మేరకు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్​ఎస్​ పార్టీలో చేరాలని కోరామని, ఆయన ఆదివారం సీఎం కేసీఆర్​తో భేటి అవుతారన్నారు. జనగామలో జరిగే బహిరంగ సభలో బీఆర్​ఎస్​లో చేరాలని కోరగా అందుకు సుముఖత చూపారన్నారు.

సీఎం కేసీఆర్​తో మాట్లాడిన తర్వాత పొన్నాల నిర్ణయం ప్రకటిస్తానని పేర్కొరన్నారు. పొన్నాల లక్ష్మయ్యకు పార్టీలో సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇస్తామని, పొన్నాల 1960లోనే అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి, నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఇంజినీర్‌గా పనిచేశారన్నారు. అలాంటి సీనియర్​ నాయకుడిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి దిగజారి మాట్లాడటం సరికాదన్నారు. ‘చచ్చే ముందు పార్టీ మారడం అనడమేంది. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలుసు. ఇది మంచి పద్దతి కాదు.

రేవంత్​ రెడ్డి నువ్వు ఎన్ని పార్టీలు మారలేదు. మొదట బీజేపీ ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌, టీఆర్‌ఎస్‌, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్‌, రేపు.. ఏ పార్టీలోకి వెళ్తారో ఎవరికీ తెలీదని, అలాంటి వ్యక్తి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసే వాళ్లు నవ్వుకుంటున్నారు. కనకపు సింహాసనంపై ఓటుకు నోటు కేసు దొంగను కూర్చోబెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ.. సీనియర్‌ నేతలకు కనీసం అపాయింట్​మెంట్‌, గౌరవం కూడా ఇవ్వడంలేదు’ అని మంత్రి కేటీఆర్​ తీవ్ర విమర్శలు చేశారు.

Recent

- Advertisment -spot_img