Homeహైదరాబాద్latest News'రేవంత్ రాసి పెట్టుకో' అంటూ.. సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ స్ట్రాంగ్ వార్నింగ్..!

‘రేవంత్ రాసి పెట్టుకో’ అంటూ.. సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ స్ట్రాంగ్ వార్నింగ్..!

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మరోసరి తీవ్రంగా మండిపడ్డారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెడుతున్నట్లు ఈ రోజు రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి.. ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ.. అసలురంగు అందరికీ తెలుసని కీలక వ్యఖ్యలు చేశారు. నీ ఆలోచనల్లో కుసంస్కారం… నీ మాటలు అష్ట వికారం అంటూ మండిపడ్డారు.

తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన.. నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో.. తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం.. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం.. జై తెలంగాణ అంటూ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img