Homeహైదరాబాద్latest Newsరెడ్డి సంఘ భవనంలో చట్టపరమైన అవగాహన కార్యక్రమం

రెడ్డి సంఘ భవనంలో చట్టపరమైన అవగాహన కార్యక్రమం

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలోని రెడ్డి సంఘ భవనంలో నిర్వహించిన చట్టపరమైన అవగాహన కార్యక్రమానికి జగిత్యాల జిల్లా 2వ అడిషనల్ జడ్జి వినీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జగిత్యాల జిల్లా 2వ అడిషనల్ జడ్జి వినీల్ కుమార్ మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకమైన పనులు చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.ఏమైనా సమస్యలు ఉంటే చట్టానికి లోబడి పరిష్కరించుకోవాలని అన్నారు.యువత గంజాయికి బానిసై చెడు దారిలో వెళ్ళవద్దని,ఆటో డ్రైవర్ల అందరూ లైసెన్స్,ఫిట్నెస్ తీసుకోవాలని తెలియజేశారు.డబ్బులు లేని వారు ఏదైనా కోర్టు సమస్య ఉంటే కోర్టుకు వచ్చి తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసి ఇస్తే కోర్టే ప్రభుత్వ లాయర్ ని నియమిస్తుందని అన్నారు. అనంతరం 2వ అడిషనల్ జడ్జి వినీల్ కుమార్ ను గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేరెళ్ళ మహేష్,ఓర్సు విజయ్ సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్సై చిర్ర సతీష్,జగిత్యాల్ న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు డబ్బు లక్ష్మారెడ్డి,విశాలాదిత్యరావు,నిఖిల్ రెడ్డి,ప్రవీణ్ కుమార్,గ్రామ పంచాయతీ కార్యదర్శి మధుసూదన్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img